Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాశి ఖన్నాకు బాలీవుడ్‌ ఆఫర్‌..!

ముంబై : రాశి ఖన్నాకు బాలీవుడ్‌ సినిమా ఆఫర్‌ వచ్చినట్టు తాజా సమాచారం. సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటాని జంటగా ‘యోధ’ అనే మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్‌ పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నారని లేటెస్ట్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ‘థ్యాంక్యూ’ సినిమాను పూర్తిచేసింది. అలాగే మాచో హీరో గోపీచంద్‌ సరసన ‘పక్కా కమర్షియల్‌’ మూవీలోనూ చేస్తోంది. దీనికి మారుతి దర్శకుడు. ఈ క్రమంలోనే తమిళంలో ‘సర్దార్‌’ సినిమాతో కలిపి నాలుగు సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్స్‌గా వెలిగేందుకు ట్రై చేస్తున్న పూజా హెగ్డే, రష్మిక మందన్నల రూట్‌లో రాశి కూడా చేరింది. చూడాలి మరి ఈమెకు బాలీవుడ్‌ ఏమేరకు కలిసివస్తుందో.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img