Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘రిపబ్లిక్‌’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హైదరాబాద్‌ : సాయిధరమ్‌తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్‌’ చిత్రం నుంచి లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘‘సూడబోదుమా .. ఆడబోదుమా .. సెయ్యి సెయ్యి కలిపి సేరబోదుమా’’ అంటూ సాగిన పాటకు మణిశర్మ స్వరాలు కూర్చారు. జాతర వాతావరణంలో జనంతో కలిసి హీరో ఆడిపాడే పాటగా ఇది కనిపిస్తుంది. పాటలో హీరోతో పాటు హీరోయిన్‌ కి కూడా చోటు ఉంది. జానపద బాణీలో ఊపుతో హుషారుగా ఈ పాట నడుస్తోంది. భగవాన్‌ – పుల్లారావు కలసి నిర్మించిన ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం వెయిట్‌ చేస్తోంది. రాజకీయాల నేపథ్యంలో సాగే చిత్రంలో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్‌ అలరించనుంది. ఆంధ్రలో విశేషంగా జరిగే పెద్దింట్లమ్మ జాతర నేపథ్యంలో సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులను అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img