Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరుడు కావలెను చిత్రం నుంచి ప్రేమగీతం

హైదరాబాద్‌ : నాగశౌర్య, రీతువర్మ జోడీగా సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘వరుడు కావలెను’ చిత్రం నుంచి బుధవారం ప్రఖ్యాత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు కూర్చిన ఈ పాటను ప్రముఖ గాయని చిన్మయి ఆలపించారు. ఈ పాట చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు రూపంగా కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగశౌర్య, రీతువర్మల అభినయం ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రఖ్యాత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండి పోయే పాటగా వారి హృదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను.. అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణా నంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img