హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ఈమధ్య వరస విజయాలు సాధిస్తున్నారు. మామూలుగా అయితే బాలకృష్ణ పారితోషికం గురించి ఎప్పుడూ చర్చ రాదు, ఉండదు. ఎందుకంటే కొంచెం నిర్మాతలని దృష్టిలో పెట్టుకొని తన పారితోషికం తీసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు చాలామంది నటులు పారితోషికం పెంచుకుంటూ వెళుతున్నారు. వరస విజయాలతో ఉన్న బాలకృష్ణ కూడా పారితోషికం కొంచెం పెంచితే బాగుంటుంది అని తన పారితో షికాన్ని కూడా పెంచాడని ఒక టాక్ నడు స్తోంది పరిశ్రమలో. ఇప్పుడు బాలకృష్ణ తన పారితోషికాన్ని రూ.20 కోట్లకు చేసినట్టు భోగట్టా. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకి ఇదే పారితోషికాన్ని తీసుకుంటున్నాడు అని కూడా అంటున్నారు. బాలకృష్ణ ఎప్పుడు పడితే అప్పుడే ఎలా అంటే అలా తన పారితోషికాన్ని పెంచే నటుడు కాదు కాబట్టి, కొన్ని సంవత్సరాలకి ఒకసారి పెంచుకుంటూ వెళతాడు. ఇప్పుడు అతని సినిమాలు కూడా 70 కోట్ల వరకు ధియే టరికల్ వ్యాపారం చేస్తున్నాయి, అదీ కాకుండా అతని సినిమాలు ఓటీటీ, టీవీ చానెల్స్లో మంచి డిమాండ్ ఉంది. వాటికీ కూడా బాగా డబ్బులు చేసుకుంటున్నారు నిర్మాతలు. కాబట్టి, బాలకృష్ణ తన పారితోషికాన్ని పెంచాడు అని అంటున్నారు. ఇంతకు ముందు సుమారు రూ.15 కోట్లు వరకు తీసు కున్న బాలకృష్ణ ఇకనుండి రూ.20 కోట్లు తీసుకుంటాడు. అతని సినిమాలకి వచ్చిన క్రేజ్, ఉన్న డిమాండ్ అలాంటిది మరి. నిర్మాతలు కూడా అతనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.