హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఒక సినిమా తియ్యబోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. అది కూడా రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. అందులో మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ కూడా ఖరారు చేశాడు వర్మ. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్, వైఎస్ భారతి క్యారెక్టర్లో ఎవరు నటిస్తున్నది స్పష్టం చేశాడు వర్మ. అంతకుముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాలో జగన్ పాత్ర చేసిన అజ్మల్ అమీర్ ఈ సినిమాలో కూడా జగన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్ నటించబోతున్నారు. ఈ లుక్స్ చుసిన ఆడియన్స్… పాత్రలకు వీరు సరిగ్గా సరిపోయారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వ్యూహం షూటింగ్ మొదలు పెట్టేసిన వర్మ… ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడో చూడాలి.