Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విపరీతంగా ఏడ్చేశా: రితిక

చెన్నై: ‘గురు’ సినిమాతో ఆకట్టుకున్నారు రితికా సింగ్‌. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో నటించిన ‘ఇన్‌కార్‌’ చిత్రం విడుదలైంది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా రితికా మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమన్నారు. ‘‘ఒకే రోజులో జరిగే కథ ఇది. ఓ అమ్మాయిని సాయంత్రం సమయంలో కిడ్నాప్‌ చేస్తారు. రాత్రి సమయానికల్లా తనకు ఏం జరిగింది.. కిడ్నాపర్ల నుంచి బయటపడిరదా లేదా? అనేది కథ. సినిమా ప్రారంభంలో ఏ కాస్ట్యూమ్స్‌ వేసుకున్నానో.. చివరి వరకూ వాటితోనే కనిపించాలి. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. సాక్షి గులాటీ పాత్రకు చాలా కనెక్ట్‌ అయ్యా. ఓ సన్నివేశం చిత్రీకరణ తర్వాత దర్శకుడు కట్‌ చెప్పగానే విపరీతంగా ఏడ్చేశాను. ఎందుకంటే ఆ సన్నివేశంలో నా పాత్రను అందరూ తిడతారు. దానిని నేను భరించలేకపోయాను. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే షూటింగ్‌ అయ్యాక.. కారు దిగి కాసేపు ఒంటరిగా గడిపాను’’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img