హైదరాబాద్ : ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్, మెగా రామ్చరణ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో జయరామ్ కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో ఆయన పాత్ర నెగటివ్ షేడ్స్ తో సాగుతుందని అంటున్నారు. ఆమధ్య జయరామ్ తెలుగులో ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగతి విదితమే. మెగా హీరో రామ్ చరణ్ ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత చేస్తున్నది ఈ సినిమానే. తన కెరీర్లో ఇది 15వ చిత్రం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా ఆర్టిస్టుల ఎంపిక జరుగు తోంది. ఇక శంకర్-చరణ్ సినిమా షూటింగును వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నారు.