హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా అద్భుతంగా ఉందని ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సమంత పేర్కొంది. ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మాత్రం అడుగుడుగున అడ్డంకులే ఎదురయ్యా యి. ఇక ఏప్రిల్ 14న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేసింది. కాగా తాజాగా సమంత సినిమా చూసిన అనంతరం ఇన్స్టాలో తన అభిప్రాయాన్ని వెల్లడిరచింది. శాకుంతలం చూశానని, సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పింది. ‘మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒకటైన శాకుంతలం కథకు గుణశేఖర్ గారు ప్రాణం పోశారు…బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది… కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు… ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను… పిల్లలంతా ఈ మ్యూజిక్ వరల్డ్ను ప్రేమిస్తారు… ఫ్యామిలీ ఆడియోన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ను ఆస్వాధిస్తారు… ఈ సినిమాకు సంబంధించిన జర్నీని ఎప్పటికి మర్చిపోను… ఇలాంటి అద్భుతమైన సినిమాలో నన్ను భాగం చేసినందుకు దిల్రాజు, నీలిమా గుణలకు థాంక్స్’ అంటూ సమంత పోస్ట్ చేసింది. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్ర పోషించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. రుద్రమ దేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మాలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.