హైదరాబాద్ : ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్తో ‘రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’ తెరకెక్కిస్తున్నాడు. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ మూవీ జనవరి 7, 2022న విడుదల కానుంది. ఈ తరుణంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్తో బిజీ అయి పోయాడు ఈ రాజమౌళి. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ని కలిశాడు ఈ దర్శకుడు. ఇప్పుడు దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఇంత సడెన్గా రాజమౌళి కుమారుడితో కలిసి ఈ బాలీవుడ్ స్టార్ని ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రమోషన్స్ కోసం కలిశాడని టాక్ నడుస్తోంది. ఇందుకోసం ఈ స్టార్ డైరెక్టర్ హిందీ బిగ్బాస్ షోలో పాల్గొని ప్రచారం చేయనున్నారని సమాచారం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా ఆహ్వానించడానికి న్యూస్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మరో క్రేజీ రూమర్ సైతం హల్చల్ చేస్తోంది. అదే సల్లు భాయ్ని రాజమౌళి డైరెక్ట్ చేయబోతున్నాడని. సల్మాన్ హిట్ మూవీ ‘భజరంగీ భాయ్జాన్’కి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా డైరెక్షన్ చేసే అవకాశం మొదట ఈ స్టార్ డైరెక్టర్కే వచ్చిందంట. కానీ ఆ సమయంలో ‘బాహుబలి’ సినిమాలతో బిజీగా ఉండడంతో అది చేయలేకపోయాడు. అయితే మరోసారి సల్లుభాయ్ని డైరెక్ట్ చేసే అవకాశం ఈ దర్శకుడికి వచ్చినట్లు, అందుకే ఆయన్ని కలిసేందుకు వెళ్లినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.