హైదరాబాద్: కేరళ భామ అనుపమ పరమేశ్వరన్… గతేడాది కార్తికేయ2తో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది. సిల్వర్ స్క్రీన్పై హీరోయిన్గా మెరిసిన ఈమె తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ విషయమేంటంటే? ఈ సారి సినిమాటోగ్రాఫర్గా కొత్త అవతారం ఎత్తింది. తెలుగు షార్ట్ ఫిలిమ్ ‘ఐ మిస్ యూ’ ఫొటోగ్రఫీ డైరెక్టర్గా పనిచేసింది. సంకల్ప్ గోరా డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన మొదటి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్ పోషిస్తున్న టిల్లు 2లో హీరోయిన్గా నటిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తమిళంలో ఒకటి, మలయాళంలో మరొక సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి.