అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ నుంచి ఫస్ట్ పాటను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ అనౌన్స్మెంట్ను చేసింది. ‘పుష్ప’ చిత్రాన్ని5 భాషల్లో (తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో) పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు. అందుకు తగినట్లే ఐదుగురు సింగర్స్ ఈ పాటను పాడబోతున్నారు.