హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ సినిమా రంగానికి వచ్చి 25 సంవత్సరాలైంది. అందుకని ఆమె ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడానికి సంసి ద్ధురాలయ్యారు. 25 దేశాల్లో మార్చి 17 నుంచి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రారం భిస్తున్నారు. దీని కోసం ఒక పోస్టర్ను కూడా డిజైన్ చేశారు. శ్రీలేఖ తన సినిమాల్లోని పాటలను, 25 మందికి చెందిన వివిధ గాయకులతో 25 దేశాలు తిరిగి ఈ మ్యూజిక్ ఈవెంట్ చేస్తారు. ప్రపంచంలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ప్రపంచంలో, ఐదు భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ అని, అటువంటి ఆమె ఇంకా ఎన్నో సినిమాలకు సంగీతం అందించి అలరించాలని అభినందనలు అందించారు. ఆస్కార్ అవార్డులకు వెళుతున్న రాజమౌళి అన్న చేతులమీదుగా తన వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీలేఖ చెప్పారు. ఆమె ఈసందర్భంగా రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలి సీరియల్ ‘శాంతినివాసం’కు తాను సంగీతం అందించానని చెప్పారు. ఇప్పుడు తన టూర్ పోస్టర్ కూడా తన అన్న ద్వారా రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన ఈ మ్యూజిక్ టూర్ మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి మొదలై లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 25 దేశాల్లో 25 మంది సింగర్స్తో కలిసి జరుగుతుందని శ్రీలేఖ వివరించారు.