Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

27న ఓటీటీలో ‘వాల్తేరు వీరయ్య’

హైదరాబాద్‌:మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందు బాటులోకి రానుంది. వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కి విడుదలయ్యి వసూళ్ల పరంగా సంక్రాంతి విజేతగా కూడా నిలించింది. దర్శకుడు కొల్లి బాబీ ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటంలో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడ వాల్తేరు వీరయ్య థియేటర్‌ లో ఎంత విజయం సాధించిందో ఇప్పుడు ఓటీటీ లో కూడా అంతే ఘన విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు. ఇందులో శృతిహాసన్‌ కథానాయికగా నటించగా, బాబీ సింహ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. సీనియర్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img