Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

3 నుండి జీ తెలుగులో మాయాద్వీపం

విశాలాంధ్ర-విజయవాడ: ప్రేక్షకులకు ఎంతో ప్రియమైన మాయద్వీపం షోను జీ తెలుగు ఏడేళ్ల తర్వాత మరోసారి అందరి ముందుకు తేనుంది. అంతేనా, తెలుగు టెలివిజన్‌ కు అన్నయ్య అయిన ఓంకార్‌ ఈ షో ద్వారా మళ్లీ మన చానల్‌కి వస్తున్నారు. ఆయనతోపాటు అందరికి ఎంతో ఇష్టమైన పిల్లమర్రిరాజు, ఒంటి కన్ను రాక్షసుడు ఈ ఆదివారం, అంటే అక్టోబర్‌ 3 నుంచి రాత్రి 9:00 గంటలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘తెలుగు టెలివిజన్‌ లో కనీవిని ఎరుగనంతగా, మునుపెన్నడూ ఏ నాన్‌-ఫిక్షన్‌ టీం చేయని విధంగా మాయాద్వీపం సెట్‌ ఉండబోతుంది. న భూతో న భవిష్యత్‌ అనేంత రీతిలో ఉండబోతుంది. అలా అంగరంగ వైభవంగా సెట్స్‌ ఉండడానికి 100 మంది టెక్నీషియన్స్‌ 50 రోజులు పైగా పగలు రాత్రి కష్టపడి, మన కోసం ఎంతో వైవిధ్యమైన సెట్స్‌ని రూపాందించారు’ అని, మాయాద్వీపం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని యాంకర్‌, ప్రొడ్యూసర్‌ ఓంకార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img