Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారింది

ఏపీ అసెంబ్లీలో పరిణామాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన
ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడమేంటి? వారు మనుషులా? పశువులా? బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్‌ నేతతో ఇలా వ్యవహరించడం తగదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరాశలో ఉంది. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరీ దొంగనోట్లు వేయించుకున్నారు. ఇంత చేసినా ఓడిపోవడంతో నిస్పృహలో కూరుకుపోయారు. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా? స్పీకర్‌, సీఎం ఇద్దరిదీ తప్పు ఉంది. ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అధికారం, పదవులు శాశ్వతం కాదు. రేపు నువ్వు అటువైపు ఉంటావు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్‌ చేయాలి. దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవడం మాని బాధితులను సస్పెండ్‌ చేయడం తగదు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఓ చీకటి రోజు అని నారాయణ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img