: కెప్టెన్ అమరీందర్ సింగ్
తాను కాషాయ పార్టీలో చేరబోనని, కాంగ్రెస్లో కూడా కొనసాగనని ఓ జాతీయ వార్తా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అమరీందర్ సింగ్ బుధవారం భేటీ కావడంతో ఆయన బీజేపీలో లో చేరతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన బీజేపీలో చేరబోనంటూ తేల్చి చెప్పారు. తాను ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, తనను తీవ్ర క్షోభకు గురిచేసిన పార్టీలో ఇక ముందు కొనసాగబోనని తెలిపారు.