Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో ఎన్‌ఐఏ సోదాలు

ఐసిస్‌ సానుభూతిపరుల కోసం వేట
ఏకకాలంలో 60కిపైగా ప్రదేశాల్లో దాడులు
కోయంబత్తూర్‌ కార్‌ సిలిండర్‌ పేలుడు కేసులో కర్ణాటకలో సోదాలు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తీవ్రవాద సంస్థ ఐసిస్‌ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులు వీడియోల ద్వారా వీరిని ప్రభావితం చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఇటీవల కోయంబత్తూర్‌ కార్‌ సిలిండర్‌ పేలుడు కేసుకు సంబంధించిన కేసులో ఎన్‌ఐఏ తమిళనాడులో సోదాలు నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటకలోని 45కి పైగా చోట్ల దాడులు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img