దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదురోజులు కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని, అది మరో రెండు మూడు రోజుల్లో వాయవ్య దిశగా వెళ్తుందని తెలిపింది. తెలంగాణతో పాటు దక్షిణ చత్తీస్ఘడ్, విదర్భ ప్రాంతాల్లో జోరుగా వానలు కురవనున్నాయి. గుజరాత్ తీరం నుంచి కేరళ తీరం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొంకన్తో పాటు గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 25, 26 తేదీల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.