Monday, June 5, 2023
Monday, June 5, 2023

నేడే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేడుక..విజయవాడకు చేరుకున్న రజినీకాంత్

విజయవాడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు విజయవాడలోని పోరంకి సిద్ధమైంది. అనుమోలు గార్డెన్స్‌లో నేడు ప్రారంభం కానున్న ఈ వేడుకల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ నేటి ఉదయం విమానంలో విజయవాడ చేరుకున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో హీరో బాలకృష్ణ , పలువురు తెలుగుదేశం నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.కాగా ఈ ఉత్సవాలలో మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ాఎన్్ణ విభాగంలో విశిష్ఠ అతిథులు, ాటి్ణ విభాగంలో అతిథులు, ాఆర్్ణ విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే, వేడుకలకు హాజరయ్యే వారి కోసం నాలుగైదు చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 4.30 గంటల నుంచి గ్యాలరీల్లోకి ప్రజలను అనుమతిస్తారు. ప్రాంగణం చుట్టూ మరో 20 వేల మంది వరకు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల సావనీర్‌ను విడుదల చేస్తారు. అలాగే, ఎన్టీఆర్‌పై ప్రముఖ జర్నలిస్టు వెంకటనారాయణ రాసిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img