Friday, March 31, 2023
Friday, March 31, 2023

ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదిక : మోదీ

వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్‌ వేదికగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన మోడీ.. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ లోగోను, స్మారక స్టాంపును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సంస్థలో పనిచేసిన, చేస్తున్న ఉద్యోగులకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఇక్రిశాట్‌ 50 ఏళ్ల ప్రయాణం పెద్ద మైలురాయని ప్రధాని పేర్కొన్నారు. ఇక్రిశాట్‌ సేవలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానన్నారు. వసంతపంచమి రోజు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. టెక్నాలజీని మార్కెట్‌ తో జోడిరచి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్‌ ఎంతో కృషి చేస్తుందన్నారు. వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగమని అన్నారు.సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్‌ మరింత ముందుకు సాగాలని మోదీ ఆకాక్షించారు. ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. దేశంలో ప్రాచీన, వైవిధ్యమైన వ్యవసాయ విధానం ఉందన్న మోడీ.. 25 ఏళ్ల లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇక్రిశాట్‌ కూడా ప్రత్యేక లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారని..నీరు, మట్టి మేనేజ్‌ మెంట్‌ పై అద్భుతమైన పరిశోదనలు చేశారని తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img