కొవ్వూరులో వలంటీర్లకు వందనం్ణ కార్యక్రమం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటన మరోమారు వాయిదా పడింది. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ావలంటీర్లకు వందనం్ణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో, భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనుకోని కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 5న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండు రోజల క్రితం అధికారులు ప్రకటించారు. దీనికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే, వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జగన్ కొవ్వూరు పర్యటన మరోమారు వాయిదా పడినట్టు హోంమంత్రి తానేటి వనిత నిన్న తెలిపారు. ఈ నెల 24న సీఎం కొవ్వూరు పర్యటన ఉంటుందని పేర్కొన్నారు.