Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

పేద, మధ్యతరగతి ప్రజలకు మొండిచేయి

బడ్జెట్‌ పై స్పందించిన రాహుల్‌గాంధీ
బడ్జెట్‌లో వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.39.45 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ ను నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బడ్జెట్‌ పై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మోదీ ప్రభుత్వం ‘జీరో’ సమ్‌ బడ్జెట్‌ ప్రకటించిందని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని రాహుల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా వేతన జీవులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎలాంటి ఊరట లేదు. వ్యక్తిగత ఆదాయపన్నుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోగా, పన్నుశ్లాబుల్లోనే మార్పు లేదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని రూ.50 వేలుగానే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ బడ్జెట్‌ పై స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img