Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘అగ్నిపథ్‌’ కు వ్యతిరేకంగా బీహార్‌లో హింసాత్మక ఘటనలు

పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం
రక్షణశాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా బీహార్‌ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.బీహార్‌ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆర్మీలో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న యువత కేంద్రం నిర్ణయంతో నిరాశకు గురైంది. బీహార్‌ వ్యాప్తంగా వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో రైళ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు.నవాడ, జహానాబాద్‌, ముంగర్‌, ఛాప్రాలో పెద్దఎత్తున యువత రోడ్లు ఎక్కారు. అర్రాప్‌ా రైల్వే స్టేషన్‌ వద్ద నిర్వహించిన ధర్నా కాస్తా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. నిరసన కారులు రైల్వే ట్రాక్‌పై టైర్లు, కర్రలు ఉంచారు. దీంతో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిసింది. రైల్వే స్టేషన్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.జెహానాబాద్‌ లో నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు పట్టాలపై కూర్చున్నారు. వీరిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు.కేంద్ర ప్రభుత్వం తన కొత్త పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండుతో నవాడాలో యవకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, నాలుగేండ్లు పనిచేసినతర్వాత తామేం చేయాలి అని ఓ యువకుడు ప్రశ్నించారు. నాలుగేండ్ల సర్వాత తర్వాత మేం ఉపాధి కోల్పోయి రోడ్లపై పడుతాంమని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img