Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అదేం పార్టీ? అదేం ప్రజాస్వామ్యం? : చంద్రబాబు

ఏం సాధించారని అద్దె మనుషులతో ప్లీనరీ నిర్వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారా? అదేం పార్టీ? అదేం ప్రజాస్వామ్యం? .. రెండు సంవత్సరాలకోసారి ప్లీనరీ నిర్వహించుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని చెప్పారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జరిగిన రోడ్‌షోలో బాబు మాట్లాడారు. ‘’తన తల్లి విజయమ్మతో రాజీనామా చేయించారు.. ఆయనే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారంట.. పార్టీలో ఇక ఎన్నికలే ఉండవంట.. అందుకు తీర్మానం చేయించుకుంటారంట.. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? అదేం పార్టీ? అదేం ప్రజాస్వామ్యం’’ అంటూ బాబు మండిపడ్డారు. బాబాయిని హత్య చేయించారని, తల్లిని, చెల్లిని సాగనంపారని, జగన్‌ చేసినట్లుగా ఇలాంటి పనులు ఎవరైనా చేయగలరా? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img