Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అప్పుల ఊబిలో ఏపీ

. రాష్ట్ర జీడీపీలో 36.5 శాతం పెరుగుదల
. పార్లమెంటులో కేంద్రం వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టుగా పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడిరచింది. ఏటేటా ఏపీ అప్పుల భారం విపరీతంగా పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్‌ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,98,903.6 కోట్లకు చేరినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వకంగా తెలిపారు.
కేవలం అప్పుల భారం మాత్రమే కాకుండా ఏటా అప్పుల శాతం కూడా గణనీయంగా పెరిగిపోతున్నట్లు చెప్పారు. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గితే 2020-21 నాటికి 17.1 శాతం పెరుగుదల నమోదైంది. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూనే ఉంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 42.3 శాతం ఉండగా ఆ తరువాత భారీగా తగ్గింది. 2015లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా.. 2021 నాటికి ఏపీ స్థూల జాతీయోత్పత్తిలో 36.5 శాతానికి పెరిగినట్లు వెల్లడిరచారు. బడ్జెట్‌లో చూపించిన అప్పుల కంటే.. ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులను కూడా భారీగా చేస్తోందని మంత్రి తెలిపారు.
తెలంగాణలో ఇలా..
మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం తెలిపింది. 2018లో రూ.1.60లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2022 నాటికి రూ.3.12లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. 2017-18లోనే 95.9 శాతం అప్పులు నమోదైనట్టు వెల్లడిరచింది. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం తెలిపింది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా ఆ తరువాత భారీగా పెరుగుదల నమోదైనట్టు వెల్లడిరచింది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు తెలిపింది. ఈ విధంగా తెలుగు రాష్ట్రాలపై మోదీ సర్కారు అక్కసు వెళ్లగక్కింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img