అఫ్ఘానిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణయ్యింది. అందులో సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులను తెచ్చిన ముగ్గురికి కూడా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడిరచారు. కాబూల్ నుంచి మంగళవారం 78 మంది దిల్లీకి చేరారు. కొవిడ్ నిబంధనల మేరకు వీరిని దిల్లీలో ఛావ్లాలో ఏర్పాటుచేసిన ఇండో`టిబెటన్ బోర్డర్ పోలీసు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారికి కొవిడ్ పరీక్షలు చేయగా, 16 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్థారణయ్యింది. ప్రస్తుతం కరోనా సోకిన వారందరికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. పవిత్రగ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులను తీసుకురాగా వాటిని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అందుకున్నారు. దీంతో కరోనా కాంటాక్ట్ కేంద్రమంత్రి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ నుంచి స్వదేశానికి తరలిస్తున్న వారిని.. తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్లో ఉంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.