తాలిబాన్ల చేతిలోకి ఆఫ్ఘానిస్తాన్ వెళ్లిన తర్వాత ఆ దేశం నుంచి అన్ని దేశాలు తమ సిబ్బంది, పౌరుల్ని తరలిస్తున్న సంగతి తెలిసిందే. మన ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని దఫదఫాలుగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్థాన్లో జరుగుతున్న పరిణామాలపై అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని ప్రధాని మోదీ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న (గురువారం) అఖిలపక్ష సమావేశం జరగనున్నది. ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులు, భారత్ అనుసరించాల్సిన వైఖరిపై చర్చించే అవకాశం ఉంది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు చెప్పాలని మోదీ కోరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్లో వెల్లడిరచారు. కాగా దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష నేతలకు ప్రధాని మోదీయే ఎందుకు ఆఫ్ఘాన్ వివరాలను వెల్లడిరచడం లేదని ప్రశ్నించారు. జైశంకర్ చేసిన ట్వీట్కు ఆయన కౌంటర్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘాన్లో జరుగుతున్న పరిణామాలపై మోదీకి అవగాహన లేదా అని రాహుల్ ప్రశ్నించారు.