Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అబద్ధాలకోరు బీజేపీ: అఖిలేశ్‌

జాన్పూర్‌(ఉత్తరప్రదేశ్‌): సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం బీజేపీపై మండిపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధాల పార్టీగా అభివర్ణిస్తూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినా, రైతుల ఆదాయం మాత్రం గణనీయంగా సగానికి తగ్గించిందని ఆరోపించారు. జాన్పూర్‌లో జరిగిన ఎన్నికల సభలో అఖిలేశ్‌ మాట్లాడుతూ తన మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితిలో సడలింపు, పోలీసు శాఖలో ఖాళీలు భర్తీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘మాది కుటుంబ పాలన అంటే ఒప్పుకుంటాం. కానీ మా కుటుంబంలో నుంచి ఎవరైనా బయటకు వెళితే, కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ మిఠాయిలు తెస్తాం. కాబట్టి ‘బాబా ముఖ్యమంత్రి’ మార్చి 10న ఇంటికి వెళ్లేటప్పుడు గుల్లు కోసం కనీసం బిస్కెట్‌ ప్యాకెట్‌ అయినా తీసుకెళ్లు. మీకందరికీ గుల్లు అంటే ఏంటో చెప్పనక్కర్లేదుగా’ అంటూ ఆయన చమత్కరించారు. ‘రైతుల ఆదాయం రెట్టింపుచేస్తామని చెప్పి 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అబద్ధపు వాగ్దానాల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవ్వలేదు. ఖర్మ కొద్ది తగ్గిపోయింది’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్‌ చేస్తూ ఇకపై బాబా ముఖ్యమంత్రికి కంటినిండా నిద్ర ఉండదని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img