ప్రధాని మోదీ స్పష్టీకరణ
రైతుల ఖాతాల్లో పీఎంకిసాన్ పథకం నిధులు జమ న్యూదిల్లీ : దేశాభివృద్ధిని కరోనా వైరస్ ఎంతమాత్రం అడ్డుకోలేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. నూతన సంవత్సరంలో దేశ అభివృద్ధి పథం వేగవంతం కావాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. కోవిడ్ ద్వారా ఎదురయ్యే సవాళ్లను తిప్పికొడతామని, అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి జాగరూకత, నిఘాతో కోవిడ్
19 మహమ్మారిపై భారత్ పోరాడుతుందని నరేంద్రమోదీ చెప్పారు. దేశ ప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. పీఎం`కిసాన్ పథకం కింద పదో విడత నిధులను మోదీ శనివారం రైతుల ఖాతాలో జమచేశారు. ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం సహా అనేక రంగాల్లో 2021లో దేశం సాధించిన విజయాలను ప్రధాని వివరించారు. కరోనా మహమ్మారిపై భారత్ ఈ ఏడాది అలుపెరగని పోరాటం చేసిందని చెప్పారు. అదేసమయంలో ఈ ఏడాది అనేక సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రానున్న కాలంలో అనేక రంగాల్లో సంస్కరణలను వేగవంతం చేస్తామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆధునిక మౌలిక సదుపాయాలు సృష్టించిందన్నారు. నూతన సంవత్సరంలో అభివృద్ధి క్రమాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల అనేక సవాళ్లు ఎదుర్కొన్నామని, అయినా వృద్ధి ప్రక్రియను కరోనా అడ్డుకోలేకపోయిందని తెలిపారు. 145 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు పంపిణీ చేయడం భారత్ సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. కరోనా వైరస్ అనేక సవాళ్లను సృష్టించిందని, అయినా కరోనా భారత్ అభివృద్ధి పథాన్ని అడ్డుకోలేకపోయిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని, దీనివల్ల కేంద్ర ఖజానాపై రూ.2.6 లక్షల కోట్ల భారం పడిరదని చెప్పుకొచ్చారు. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాల్సిందిగా రైతులకు పిలుపునిచ్చారు. ప్రకృతి సేద్యం ద్వారా లభించే వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని మోదీ చెప్పారు. శనివారం ఒక్కరోజే దేశంలో కరోనా కేసులు 22,775కి పెరిగాయి. అక్టోబరు 6వ తేదీ నుంచి ఇదే అత్యధిక సంఖ్య. క్రియాశీల కేసుల సంఖ్య లక్ష దాటింది. ఒమిక్రాన్ కేసులు 1431కి చేరాయి. ఈ ఏడాది మోదీ తన మొదటి ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. భారతదేశ ఆర్థికవృద్ధి రేటు 8శాతానికి పైగా పెరిగిందని ప్రధాని తెలిపారు. రికార్డుస్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించినట్లు వెల్లడిరచారు. విదేశీ రిజర్వులు ఉన్నతశిఖరాలకు చేరాయని, జీఎస్టీ వసూళ్లు సైతం గణనీయంగా పెరిగినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఎగుమతులు ప్రత్యేకించి వ్యవసాయ ఎగుమతులు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మహిళల వివాహ వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచామని, దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు.