Friday, April 19, 2024
Friday, April 19, 2024

అసలైన సంగ్రామం 2024లోనే

మోదీ వ్యాఖ్యలపై ప్రశాంత్‌కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు
న్యూదిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫలితాలపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించలేవని, భారత్‌ కోసం అసలు సంగ్రామం 2024లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ శాసన సభ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో 2017లో గెలిచినందువల్లే 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు నిపుణులు చెప్పారన్నారు. ఇప్పుడు కూడా తాను దానినే నమ్ముతున్నానని తెలిపారు. దీనిపై ప్రశాంత్‌ కిశోర్‌ స్పందిస్తూ… రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఉండబోదని తెలిపారు. అయ్యగారికి ఈ విషయం తెలుసునన్నారు. అందుకే ఆయన తెలివైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘భారత దేశం కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుంది, నిర్ణయమవుతుంది, అంతేకానీ ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ కాదు. అయ్య గారికి ఈ విషయం తెలుసు. అందుకే ప్రతిపక్షంపై నిర్ణయాత్మక మానసిక సానుకూలత, పైచేయి సాధించడానికి రాష్ట్ర ఎన్నికల ఫలితాల చుట్టూ వెర్రిని సృష్టించే తెలివైన ప్రయత్నం. ఈ తప్పుడు కథనం ఉచ్చులో పడొద్దు, దానిలో భాగం కావొద్దు’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img