Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆక్సిజన్‌ కొరతపై రాజకీయాలు ఆపండి

కేంద్రమంత్రి మాండవీయ
న్యూదిల్లీ : ఆక్సిజన్‌ కొరతపై రాజకీయాలు చేయడం మానేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా శుక్రవారం ప్రతిపక్ష పార్టీలను కోరారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ లభ్యతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసిందని, మహమ్మారి రెండవ వేవ్‌ సమయంలో డిమాండ్‌ పెరిగిన తరువాత దాని ఉత్పత్తిని పెంచిందని అన్నారు. ాపాపం, అటువంటి పరిస్థితిలో కూడా చాలా మంది రాజకీయాలు చేయడం మానుకోలేదు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మా నిజాయితీ ప్రయత్నాలను గమనించండి. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు్ణ అని కాంగ్రెస్‌ ఎంపీ సురేష్‌ ధనోర్కర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాండవీయ చెప్పారు. ఆ సమయంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా మరణాలు సంభవించాయనే ప్రతిపక్షాల వాదనలను మాండవీయ కొట్టిపారేశారు. కేంద్రం ఈ అంశంపై రాష్ట్రాల నుండి డేటాను కోరగా ఒక్క పంజాబ్‌ ప్రభుత్వం మాత్రమే అటువంటివి నాలుగు అనుమానాస్పద మరణాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతున్నట్లు సమాధానమిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img