Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కిడ్నాపైన ఆ..భారతీయులందరూ సురక్షితం

కాబూల్‌ నుంచి భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు

కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడి
ఆఫ్గనిస్థాన్‌లో దాదాపు 150 మందికి పైగా భారతీయులను తాలిబన్లు శనివారం కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో కిడ్నాప్‌ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.ఈ నేపథ్యంలో భారతీయులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కిడ్నాప్‌ తర్వాత వీరిని కాబూల్‌ విమానాశ్రయంలో క్షేమంగా విడిచిపెట్టినట్లు సమాచారం. వీరిని కాబూల్‌ నుంచి భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆఫ్గనిస్థాన్‌ మీడియా వర్గాలు కూడా భారతీయులందరూ సురక్షితంగా ఉన్నట్లు ధృవీకరించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img