Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం.. ప్రత్యేక రైళ్లు

అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరిన దక్షిణ మధ్య రైల్వే
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఎన్‌టీపీసీ సీబీటీ 2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆ రోజు వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. నేడు తిరుపతి-సేలం, సేలం-తిరుపతి (07675/07676), 12న తిరుపతి-సేలం (07441), 13న సేలం-తిరుపతి (07442), 13న షాలిమార్‌-సికింద్రాబాద్‌ (08025), 14న షాలిమార్‌-సికింద్రాబాద్‌ (08035), 16న సికింద్రాబాద్‌-షాలిమార్‌ (08026), 17న సికింద్రాబాద్‌-షాలిమార్‌ (08036) రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img