Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ పునర్నియామకం..

ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం పొడిగించింది. శక్తికాంత దాస్‌ను పున:ర్నియామకం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ మరో మూడేళ్లపాటు పదవీలో కొనసాగనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఆయనను అదే పదవిలో పునర్నియమిస్తున్నట్లు తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల్లో వెల్లడిరచింది. కాగా కాగా, శక్తికాంత్‌ దాస్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా 2018 డిసెంబర్‌ 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2021 డిసెంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. శక్తికాంత్‌దాస్‌ పదవీకాలం ముగియడానికి నెలన్నర రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img