Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇది రైతులపై క్రమ పద్ధతిలో జరుగుతున్న దాడి

రాహుల్‌ గాంధీ

ఒక పద్ధతి ప్రకారం రైతుల హక్కులను దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. లఖింపూర్‌ హింసాత్మక ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించి, సంఫీుభావం తెలిపేందుకు ఢల్లీి నుంచి లక్నో బయలుదేరే ముందు రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ, ఇది రైతులపై క్రమ పద్ధతిలో జరుగుతున్నా దాడి అని అన్నారు. రౖౖెతులపై వాహనాలు తోలుతున్నారని, హత్యలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. నిన్ననే ప్రధాని లక్నోలో పర్యటించారు. ఆయన లఖింపూర్‌ మాత్రం వెళ్లలేదని చెప్పారు. లఖింపూర్‌ ఘటనలో కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి పేర్లు బయటకు వచ్చాయన్నారు. నిందితులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షాల బాధ్యత అని, ప్రతిపక్షాలు ఆ పని చేయకుంటే హత్రాస్‌ ఘటనను పట్టించుకునే వారే కాదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img