అవినీతి దేశ పురోగతికి అడ్డంకిగా మారి మన శక్తియుక్తులను నీరుగార్చుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్లోని కేవదియాలో బుధవారం సీబీఐ, సీవీసీ సంయుక్త సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. అవినీతిని కట్టడి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. గత 6-7 సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా.. దేశంలో అవినీతికి తావులేదని నిరూపించినట్లుగా ఆయన వెల్లడిరచారు. అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని అభిప్రాయపడ్డారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని అన్నారు.