Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈడీ విచారణకు నవదీప్‌

డ్రగ్స్‌ కేసు,మనీ లాండరింగ్‌ విషయాల్లో పలువురు టాలీవుడ్‌ ప్రముఖులను ఈడీ అధికారులు. ఒకొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. డ్రగ్స్‌ ముఠాలతో ఉన్న సంబంధాలపై.. సప్లేయిర్‌ కెల్విన్‌తో ఉన్న లింకుల గురించి. బ్యాంక్‌ లావాదేవీల గురించి ఆరా తీస్తుతున్నారు. ఇప్పటికే పూరిజగన్నాథ్‌. ఛార్మి, రకుల్‌, నందు, రానా, రవితేజాలను ఈడీ అధికారులు విచారించారు. కాగా నేడు యంగ్‌ హీరో నవదీప్‌ వంతు వచ్చింది. ఈ రోజు నవదీప్‌ని విచారించనుండగా, కొద్ది సేపటి క్రితం ఆయన ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు. నవదీప్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఎఫ్‌-క్లబ్‌లో డ్రగ్‌ పార్టీలు జరిగాయా?, సినీ ప్రముఖుల్లో ఎవరెవరు ఎఫ్‌-క్లబ్‌ కి వచ్చేవారు? కెల్విన్‌తో నీకు ఎలా పరిచయం? అనే ప్రశ్నలు వేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎఫ్‌క్లబ్‌ మేనేజర్‌ని సైతం నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు.2016లో ఎఫ్‌-క్లబ్‌ కేంద్రంగానే నవదీప్‌ అనేక పార్టీలను ఆర్గనైజ్‌ చేశాడు. ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్‌ సప్లై జరిగేదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ కోణంలోనే అధికారులు నవదీప్‌ను ప్రశ్నించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img