Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఈడీ విచారణకు హాజరైన రానా

టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే రకుల్‌, పూరిజగన్నాథ్‌, ఛార్మి వంటి వారిని విచారించారు. విచారణలో భాగంగా బుధవారం ఉదయం హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి రానా ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణలో రానా పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img