Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈసీల నియమాకంలో సుప్రీం చారిత్రాత్మక తీర్పు..వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘంలో నియామకాలను ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్షనేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని సర్వోన్నత న్యాయ స్థానం స్పష్టంచేసింది.ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజారిటీతో ఏగక్రీవ తీర్పును వెలువరించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పారదర్శకత కొరవడితే వినాశనకర పరిణామాలకు దారితీస్తుందని కూడా అభిప్రా యపడిరది. రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ న్యాయబద్ధంగా వ్యవహరిం చాలని సూచించింది. సీజేఐ, ఎన్నికల కమిషనర్ల నియామ కాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ్ట
విచారణ చేపట్టిన జస్టిస్‌ కేఎం జోసఫ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడిరచింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీరి నియామకాల కోసం పార్లమెంట్‌ కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని తెలిపింది. ఒకవేళ ప్రతిపక్ష నేత లేకుంటే, విపక్షంలో మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ, సీఈసీల తొలగింపు వలే ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img