ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ బహిరంగ లేఖ
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మొదటి నుంచి తన మద్దతు తెలుపుతున్న ఎంపీ వరుణ్ గాంధీ తాజాగా మరోసారి స్పందించారు. సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతించిన ఆయనó ఇవాళ ఈ డిమాండ్లను కూడా తీర్చండంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కనీస మద్దతు ధరపై కూడా రైతుల డిమాండ్లను అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే రైతుల ఉద్యమం ఆగదని అభిప్రాయపడ్డారు. లఖింపూర్ ఖేరీ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని, నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ మేరకు ప్రధానికి వరుణ్గాంధీ బహిరంగ లేఖ రాశారు. సాగుచట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని, ఏడాదికాలం నుంచి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభించిందన్నారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈఉద్యమంలో పోరాడుతూ 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ ఈ నిర్ణయాన్ని మీరు ముందే తీసుకోని ఉంటే వారు ప్రాణాలను పోగొట్టుకునే వాళ్ళు కాదు కదా అని పేర్కొన్నారు. అందువల్ల కోరేది ఏమిటంటే మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అలాగే ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని, లఖింపూర్ ఖేరీ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని వరుణ్ గాంధీ లేఖలో తెలిపారు.