Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈ వార్తలు మీడియా ద్వారానే వింటున్నా..

కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇస్తారంటూ వస్తున్న వార్తలను ఖండిరచిన అశోక్‌ గెహ్లాట్‌
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించే విషయం తెలియదని రాజస్థాన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు.పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ తనకు బాధ్యతలు అప్పగించబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. మీడియా ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. వివరాలేమీ తెలియదు. నాకు కేటాయించిన విధుల్ని నేను నిర్వర్తిస్తున్నాను. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుతం నేను ఆ రాష్ట్ర పరిశీలకుడిగా ఉన్నాను. రాజస్థాన్‌లో నా బాధ్యతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. మిగిలిన విషయాలు అన్నీ మీడియా నుంచే వింటున్నాను.’ అని అశోక్‌ గెహ్లాట్‌ చెప్పారు. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో అశోక్‌ గెహ్లాట్‌ కు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియాకు వయసు మీద పడిపోవడం, రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలకు విముఖంగా ఉండడంతో ప్రత్యామ్నాయం కోసం పార్టీ వెతుకుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img