ఉక్రెయిన్లో రష్యా జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే దేశానికి చెందిన మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రష్యా, ఉక్రెయిన్ సైనికుల మధ్య జరిగిన పోరులో ఓ భారతీయ విద్యార్థి కాల్పుల్లో గాయపడ్డాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు కోసం పోలాండ్ వెళ్లిన మంత్రి వీకే సింగ్.. ఈ విషయాన్ని రిజోవ్ విమానాశ్రయంలో మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను వీడి సరిహద్దులకు వస్తుండగా.. కాల్పుల్లో ఓ భారత విద్యార్థి గాయపడినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అతన్ని కీవ్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్లో ఇంకా 1700 మంది భారతీయ విద్యార్థులు చిక్కున్నారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం అడ్వైజరీ జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ను వదిలి వచ్చారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడానికి ముందు సుమారు 20 వేల మందికి పైగా భారతీయులు అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్న విషయం తెలిసిందే.