Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత

నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్తవ్యస్తతకు గురయ్యారు. ఆయనకు మర్రిపాడులోని నివాసంలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆరోగ్యం బాగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని మీడియాకు చెప్పారు. గుండె నొప్పి రావడంతో చెన్నైకి తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించిన చంద్రశేఖర్‌రెడ్డి గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోలుకున్నారు.మరోవైపు ఉదయగిరిలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే మేకపాటి వర్సెస్ వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. దీంతో గురువారం సాయంత్రం మేకపాటి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు.. రోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు. ఎవరో ఉదయగిరికి వస్తే తరుముతామన్నారని.. వాళ్లెవరో ఇప్పుడు రావాలంటూ సవాల్ చేశారు.మేకపాటి వెళ్లిపోయిన కొద్దిసేపటికి వైఎస్సార్‌సీపీ నేతలు బస్టాండ్ దగ్గరకు వచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే ఇప్పుడు రావాలని సవాల్ చేశారు. తాము లేని సమయం చూసి రావడం కాదని.. ఇప్పుడు బస్టాండ్ సెంటర్‌కు రావాలన్నారు. దీంతో రెండు గ్రూపుల మధ్య వార్ మరింత ముదిరింది. ఈ సవాళ్లు శుక్రవారం కూడా కొనసాగాయి.
ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ రెడ్డిని సవాల్‌ చేస్తూ బస్టాండ్‌ దగ్గర వైఎస్సార్‌సీపీ నేత వినయ్ కుమార్ రెడ్డి కుర్చీలో కూర్చున్నారు. తనకు మేకపాటిలా మాట్లాడటానికి సంస్కారం అడ్డు వస్తుందన్నారు వినయ్. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే కోట్ల రూపాయలు దండుకున్నారని.. పార్టీనీ నాశనం చేసి, టీడీపీకి అమ్ముడు పోయారంటూ మండిపడ్డారు.

మరోవైపు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తన బాబాయి చంద్రశేఖర్ రెడ్డి ఎపిసోడ్‌పై స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఎవరి పైన అయినా చర్యలు తప్ప్పవని.. తన బాబాయి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ బ్యానర్, ఇంటి పేరు వదిలితే ఆయన శక్తి ఏంటో తెలుస్తుందన్నారు. మేకపాటి ఫ్యామిలీ జగన్‌తోనే ఉంటుందని.. ఆయన వెంటే నడుస్తుందన్నారు. ఇప్పుడు, ఎప్పుడూ సీఎం జగన్ తోనే తమ ప్రయాణం అని తేల్చి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక.. టీడీపీ మీడియాను అడ్డు పెట్టుకొని దుష్ప్రచారం చేస్తుందన్నారు. వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం లేదని.. ప్రజల గుండెల్లో సీఎం వైఎస్ జగన్ పదిలంగా ఉన్నారన్నారు. 2024లో నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి.. సీఎం కి గిఫ్ట్ గా ఇస్తామన్నారు.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి క్రాస్ ఓటింగ్ చేశారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధిష్టానం ప్రకటించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే వర్సెస్ వైఎస్సార్‌సీపీ నేతలు అన్నట్లు మాటల యుద్ధం కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img