మోదీ సర్కారుపై సోనియా నిప్పులు
ఎదురుదాడికి దిగిన మంత్రులు
న్యూదిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)కు బడ్జెట్లో కోత విధించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆగ్రహం వెలిబుచ్చారు. చాలా రాష్ట్రాలకు ఉపాధి హామీ నిధులు అందడం లేదని, దాదాపు రూ.5 వేల కోట్లు ఆయా రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కార్మికులకు కూలి చెల్లింపులో జాప్యం జరుగుతోందని చెప్పారు. లోక్సభ జీరో అవర్లో సోనియాగాంధీ గురువారం ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉపాధి హామీ పథకానికి చాలినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సోనియా విజ్ఞప్తి చేశారు. కోవిడ్19 మహమ్మారి వేళ ఈ పథకం ప్రభుత్వానికి బాగా ఉపయోగపడిరదని, పేదలకు 15 రోజుల్లో చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, సోనియా ఆరోపణలను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి గిరిరాజ్సింగ్, ఐబీ మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. ఉపాధి హామీ పథకం నిధులను సోనియా రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. సోనియా ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. ‘గౌరవ సభ్యురాలు లేవనెత్తిన అంశం వాస్తవానికి దూరంగా ఉంది. 2013
14(యూపీఏ హయాం)లో ఈ పథకానికి రూ.33 వేల కోట్లు కేటాయించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రూ.1.12 లక్షల కోట్లు కేటాయించింది. మేము అద్దంలో చూసుకోవాల్సిన అవసరం లేదు’ అని గిరిరాజ్సింగ్ వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకాన్ని కొంతమంది నాడు హేళన చేశారని, కానీ కరోనా మహమ్మారి సమయంలో కోట్లాది పేద కుటుంబాలకు ఇది ఉపయోగపడిరదని, ప్రభుత్వ సాయంలో కీలకపాత్ర పోషించిందని సోనియాగాంధీ వివరించారు. ‘ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు క్రమేణా తగ్గిస్తూ వస్తున్నారు. 2020తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి 35శాతం తక్కువగా నిధులు కేటాయించారు. అదేసమయంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది’ అని సోనియా తూర్పారబట్టారు. బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం వల్ల సకాలంలో కూలీలకు డబ్బులు చెల్లించలేకపోతున్నారని, ఉపాధి కల్పించడం కష్టంగా మారిందని ఆమె అన్నారు. ఉపాధి హామీ పథకానికి చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వెలిబుచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. సోషల్ ఆడిట్, లోక్పాల్ నియామకం వంటి అన్ని షరతులను పరిపూర్తి చేసినప్పటికీ ఉపాధి కూలీల వార్షిక బడ్జెట్ ఇప్పటికీ ఆమోదం పొందలేని రాష్ట్రాలు ఫిర్యాదు చేయడాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. సోషల్ ఆడిట్ను సమర్ధవంతంగా పూర్తి చేసినప్పటికీ నిధులు నిలిపివేయడం ద్వారా కూలీలను శిక్షించవద్దని సోనియా హితవు పలికారు. ఉపాధి హామీ పథకానికి చాలినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. పనిచేసిన 15 రోజుల్లో కూలీలలకు డబ్బులు చెల్లించేందుకు సహకరించాలన్నారు. ఒకవేళ వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగితే పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ఠాకూర్ జోక్యం చేసుకుంటూ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, దీనిని మోదీ ప్రభుత్వం తరిమికొట్టిందని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో జియో ట్యాగింగ్ తీసుకొచ్చి..ఉపాధిహామీ పథకం కింద ఆస్తులు సృష్టించారని, జన్ధన్ ఖాతాల ద్వారా నేరుగా కూలీలకు చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రులు సింగ్, ఠాకూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వెలిబుచ్చారు. యూపీఏను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు.