రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశంపై ఉభయ సభల్లోనూ దుమారం రేగుతోంది. వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన దిగాయి. నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కూడా పాల్గొన్నారు. 4 రోజులుగా సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల నిరసనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.