Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎంపీ అవినాష్‌ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 28వతేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ ఎంపీ అవినాష్‌ రెడ్డికి నోటీసులు పంపింది. ఇటీవలే ఎంపీకి సీబీఐ నోటీసులు ఇవ్వగా.. మళ్లీ రెండోసారి సీబీఐ అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు.సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్‌ రెడ్డికి సోమవారం మధ్యాహ్నం నోటీస్‌ ఇచ్చి మంగళవారం విచారణకు రమన్నాన్నారు. అయితే ఆయన ముందే ఫిక్స్‌ చేసుకున్న షెడ్యూల్స్‌ కారణంగా మంగళవారం విచారణకు రాలేదు. దీంతో సీబీఐ అధికారులు మరోసారి ఎంపీ కి నోటీసులిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img