విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడం పెను దుమారాన్నే రేపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఫేస్ బుక్ ద్వారా విరుచుకుపడ్డారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు (శంషాబాద్ విమానాశ్రయం) పేరు మార్చారన్నారు.మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారన్నారు. పంచ భూతాలున్నాయ్.. తస్మాత్ జాగ్రత్త అన్నారు. అక్కడ ఆ మహానీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయన్నారు.