సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఎన్డీఏ పరీక్షలో మహిళలకు అవకాశం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ఎన్డీఏ పరీక్షలను మహిళలు రాసేందుకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆర్మీ తీరును సుప్రీం ఖండిరచింది. ఎన్డీఏ పరీక్షలో మహిళలకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అయితే తమ విధివిధానం ప్రకారం మహిళలకు స్థానం కల్పించడం లేదని ఆర్మీ కోర్టుకు తెలపగా.. ఆ విధానం లింగవివక్షతో కూడుకుని ఉన్నట్లు కోర్టు ఆరోపించింది. తుది ఆదేశాలకు లోబడి అడ్మిషన్లు ఉంటాయని పేర్కొంది. ఎన్డీయే పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించాలని కోరుతూ కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషీకేశ్ రాయ్లతో కూడిన ధర్మాసనం ఈ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది.