ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితి : మమతా బెనర్జీ
పెగాసస్ వ్యవహారంపై పోరాడడానికి తమ పార్టీ ముందంజలో ఉంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి మమత గైర్హాజరయ్యారు. దీనిపై ఆమెను ప్రశ్నించగా, పెగాసస్ వ్యవహారంపై పోరాడడానికి తమ పార్టీ ముందంజలో ఉంటుందన్నారు. ఎమర్జెన్సీ కంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, తన ఫోన్ హ్యాక్ అయ్యిందని అందుకే ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని అన్నారు. అభిషేక్ బెనర్జీ, ప్రశాంత్ కిశోర్ ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయన్నారు. ఒక్క ఫోన్ హ్యాక్ అయ్యిందంటే చాలు.. అన్ని ఫోన్లూ హ్యాక్ అవుతాయని పేర్కొన్నారు.