Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏడు వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. 543 రోజుల కనిష్ఠానికి కనిష్టానికి దిగొచ్చాయి. కొద్దికాలంగా కరోనా వైరస్‌ అదుపులో ఉండటంతో కొత్త కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,579 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో 236 మంది మరణించగా, మరో 12,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,13,584 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 536 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్‌ కేసులు చేరుకున్నాయి. కేరళలో నిన్న 3,698 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 75 మంది మరణించారు.ఇక దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న 71,92,154 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 117 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img